‘‘జెండా’’ ఉమ్మడి సభ వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది

  • తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాసు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం బొలిశెట్టి శ్రీనివాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో తలపెట్టిన తెలుగు జన విజయకేతనం జెండా ఉమ్మడి సభ విజయవంతం చేసిన ప్రజానీకానికి, జనసేన, టిడిపి కార్యకర్తలు, జనసేన వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జెండా సభకు ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించదలుచుకున్నా అధికార పార్టీకి జనం సభ చంప దెబ్బ లాంటిదని అయిన తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన మొదటి ఉమ్మడి సభ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టించిందని, అధికార పార్టీ మదంతో సభకు జనాన్ని తరలించే ప్రైవేటు బస్సులను పోలీస్ సిబ్బందితో అరికట్టాలని చూసినా, ఆటోల్లో బైకుల మీద రావడం అధికార పార్టీకి ఓటమికి నిదర్శనం అని మరొకసారి నిరూపించారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ జరిగిన సభను ప్రజల్లోకి చేరవేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు.