భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఉరవకొండ: బెలుగుప్ప మండలం, గుండ్లపల్లి గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి పయ్యావుల కేశవ్ కుమారుడు పయ్యావుల విక్రమసింహా హాజరయ్యారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, జనసైనికులు ప్రకాష్, చెన్నకేశవ ఆచారి, ప్రహ్లాద, రావినాయక్ పాల్గొన్నారు.