సత్తెనపల్లిలో ఘనంగా జనసేన 11 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో మరియు సత్తెనపల్లి పట్టణ జనసేన పార్టీ కార్యాలయాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు మధ్య భారీ కేకు కటింగ్ చేశారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ 11వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి జనసేన చాలా క్రియాశీలకంగా మారుతుందన్నారు. పార్టీ ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి జనసేన నాయకుడు కార్యకర్త పని చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం మనమంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల ద్వారా జనసేన సత్తా ఏమిటో అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కమిటీ వారు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.