పవనన్న ప్రజాబాట 118వ రోజు

నెల్లూరు సిటీ నియోజకవర్గం, నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 118 వ రోజు పవనన్న ప్రజాబాట ఆదివారం స్థానిక 13 వ డివిజన్ వేపదరువు ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పవనన్న ప్రజాబాటలో ప్రజలకు అందజేయడం జరిగింది. నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్వహిస్తున్న “పవనన్న ప్రజాబాట” కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన్ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.