మొక్కజొన్న రైతులను ఆదుకున్న బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటను వేసిన రైతు ఉప్పతోళ్ల అంకారావు రెండు ఎకరాల పంట ప్రమాదవశాత్తు పూర్తిగా మంటలతో తగలబడిపోయినది. ఈ విషయం తెలుసుకున్న బొర్రా వెంకట అప్పారావు తక్షణమే స్పందించి రైతుతో పాటు పంట పొలాన్ని సందర్శించి, నష్టపోయిన రైతుకి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.