జనసేనాని గెలుపుకోసం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

కర్ణాటక రాష్ట్రం, చింతామణి తాలూకా చింతామణిలో జనసేన చింతామణి ఆర్మీ టీం మరియు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ చింతామణి వారి ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు, పూజలు జరిపించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలవాలని విజయవంతంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మెగా ఫ్యామిలీ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కలసికట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిడ్డు, నాగరాజు, సాబుద్ధిన్సు, సునీల్, రమేష్, శ్రీనివాస్, హరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.