జేరిపోతుల సనత్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారతరత్న, నవ భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సేవా సంఘం- జేరిపోతుల సనత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా ఆపిల్ బాలు అన్న పాల్గొని భూపాలపల్లి లోని అన్ని హాస్పిటల్స్ లో రోగులకు ఆపిల్స్, దానిమ్మ, అరటి పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం భూపాలపల్లి లోని అక్షర స్వచ్చంద సేవ సంస్థ లోని వృద్దులలకు కూడా పండ్ల పంపిణి చేసారు. ఈ సందర్బంగా సనత్ కుమార్ మరియు ఆపిల్ బాలు మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈ విధంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని యువత అంబేద్కర్ సూచించిన మార్గంలో ముందుకు నడిచి దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం జిల్లా నాయకులు శీలపాక హరీష్, సెగ్గం రాజుకుమార్ నేత రమేష్, సురేష్, క్రాంతి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.