కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు టీకా ఇచ్చారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో తమిళిసై టీకా తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆమె.. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.