ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 11న నామినేషన్ల పరిశీలన.. 18 వరకు ఉప సంహరణకు సమయం ఇచ్చారు. 30న పోలింగ్ వచ్చేనెల 2న కౌంటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
![](https://i0.wp.com/tolivelugu.com/wp-content/uploads/2020/07/Election-commission.jpg?resize=300%2C160&ssl=1)
నామినేషన్ కేంద్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు అధికారులు. 144 సెక్షన్, రెండు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని… రోజూ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు అధికారులు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో… వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.