Vizag-Gajuwaka: వైస్సార్సీపీ నాయకుడు మద్ది శంకర్ రెడ్డి అనే వ్యక్తి పై ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకురాలు రెయ్యి రత్నం

వైస్సార్సీపీ నాయకుడు మద్ది శంకర్ రెడ్డి అనే వ్యక్తి పై ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకురాలు రెయ్యి రత్నం. ఫోన్ సంభాషణలో భాగంగా తన పై అనుచిత వ్యాఖ్యలు చేసినందు గాను శంకర్ రెడ్డి అనే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన 65వ వార్డు జనసేన పార్టీ నాయకురాలు రెయ్యి రత్నం. రాజీవ్ మార్గ్ లో నిన్న దేవాలయం, పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం పై తలెత్తిన వివాదం… ఈ నేపద్యంలో మద్యం దుకాణంకి వ్యతిరేకంగా దర్నా చేసిన స్థానికులు, మహిళలు, జనసేన నాయకులు. మహిళ నాయకురాలు రత్నం పై అనుచిత వాఖ్యలు చేసినందుకు గాను గాజువాక ఇంచార్జి శ్రీ కోన తాతరావు, కార్పొరేట్ అభ్యర్థులు ,జనసైనికుల ఆద్వర్యంలో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసారు.