బండారు కిరణ్ కు జనసేన అధ్యక్షులు పవన్ అభినందనలు

ప్రియమైన కిరణ్ కుమార్ బండారు గారికి శుభాభినందనలు,..
గత సంవత్సరం అనగా 2020-21 లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ద్వారా మీరు ఈస్ట్ గోదావరి జిల్లా, అమలాపురం (ఎస్సి) నియోజకవర్గం నుండి 49 మందిని పార్టీలో క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయించారన్న విషయం నా దృష్టికి వచ్చింది. అందుకుగాను ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలు. పార్టీ ఎదుగుదలకు మీరు వెచ్చిస్తున్న సమయాన్ని, శ్రమను నేను ఎప్పుడూ మరచిపోలేను. జనసైనికుల కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వంతో పాటు ప్రమాదభీమా పథకాన్ని నా వంతు బాధ్యతగా ప్రవేశపెట్టాను. ఇది తొలి అడుగు మాత్రమే. యువతతోనే భవిత అని నమ్మి మార్పుకోసం రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాకు ఆ దిశగా బాధ్యతతో కూడిన మీ బలమైన అడుగులు ఆనందానికి గురిచేస్తున్నాయి మరియు మన లక్ష్యానికి మరింత చేరువ చేస్తున్నాయి. మన దేశం, మన ప్రగతి.. నిజాయతీ, దీక్షాదక్షత కలిగిన పౌరుల వల్లే మన గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయి. భావితరాల భవిష్యత్తు కోసం మీరే నాయకులుగా తయారవ్వండి. మీ ప్రాంతం లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి అక్కడ ఉండే మీకే బాగా అవగాహన ఉంటుంది. కనుక మానవతా దృక్పథంతో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ అవసరమైనప్పుడు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. ఆ క్రమంలో ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వెన్నుదన్నుగా నేను నిలుస్తాను. క్రియాశీలక సభ్యుల వల్లే పార్టీ నిర్మాణం ముందుకు కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీరు మరింత తోడ్పాటునందించి మీ ప్రాంతంలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను. మీరు జనసేన పార్టీపై ఉంచిన నమ్మకానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరలా వేరొక సందర్భంలో కలుద్దామని జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.