రైతులకు తక్షణ సహయం అందించాలి ఉంగుటూరు జనసేన డిమాండ్
ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం వాకపల్లి గ్రామంలో తుఫాను తీవ్రతకు దెబ్బతిన్న పంటలను శనివారం పరిశీలించి, రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ రైతులకు తక్షణ సహయం అందించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి రైతు గోడుని తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, కట్రేడ్డి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు వాకపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/Ungujuru-constituency-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-28-at-9.39.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-28-at-9.42.35-PM-1-1024x576.jpeg)