జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా నారాయణవనం జనసేన

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ ఆదేశాల మేరకు నారాయణవనం మండలంలో చెన్నై జాతీయ రహదారిపై ప్లకార్డులతో మద్దతు తెలిపిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో నాయకులు చరణ్, సుమన్, సతీష్, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.