డిజిటల్ క్యాంపెయింగ్ లో నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే డిజిటల్ క్యాంపెయింగ్ లో భాగంగా నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి నాయకత్వం లో నెల్లూరు సిటీ లోని వి.ఆర్ కూడలిలోని డా” బి.ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తి తో #Raise_Placards_ANDHRA_MP అనే నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో MP లు అందరూ ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజల్లో తిరిగి విశాఖ ఉక్కు పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పావుజెన్నీ చంద్ర శేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి,షేక్ ఆలియా, మూడూరి కార్తిక్, చెరుకూరి హేమంత్, కుక్క ప్రభాకర్, రాము, గణేష్, జీవన్, జాఫర్, నాగరాజు, రవి, ఈశ్వర్, వెంకట్, అశోక్, కోటి తదితరులు పాల్గొన్నారు.