పవన్ కళ్యాణ్ సమక్షంలో గురాన ఆయ్యలు జనసేనలో చేరిక

విజయనగరం: జనసేన పార్టీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త, విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త, గురాన అయ్యలు పార్టీలో చేరారు. స్వతహాగా మెగాఫ్యామిలీకి వీరాభిమాని అయిన అయ్యలు గతంలో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా చేశారు, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత వైఎస్సార్సీపీ పార్టీలో విజయనగరం జిల్లా సమన్వయ కర్తగా కొంతకాలం పనిచేసిన ఆనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గురాన అయ్యలు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మరియు పలు స్వచ్ఛందసంస్థల ద్వారా వారి తండ్రి గురాన సాదూరావు స్పూర్తితో సేవాకార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతో మమేకమైన వ్యక్తిగా జిల్లాలో అయ్యలు గుర్తింపు పొందారు. గురాన ఆయ్యలు జనసేన పార్టీలో చేరారు గనుక విజయనగరం జిల్లా రాజకీయాల్లో మార్పు మొదలైందని, ఎక్కువశాతం ఓ సమాజ సేవకుడిగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిగా, జిల్లాలో పెద్దలు, యువత, అన్ని వర్గాల వారికి ఎక్కువగా ఆకట్టుకునే అయ్యలు రాకతో జిల్లాలో సంతోషహర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యలుతో పాటు జిల్లాకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆధాడ మోహన్ రావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డోల రాజేంద్రప్రసాద్, జమ్ము ఆదినారాయణ, తుమ్మగంటి సూరి నాయుడు, పోల అరుణ్ కుమార్, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) జనసేన యువ నాయకులు లంకరమేష్, పిడుగు సతీష్,లోపింటి కళ్యాణ్, ఎంటి రాజేష్, రవీంద్ర, నడింవలస బాబురావు తదితులు పాల్గొన్నారు.