డిజిటల్ క్యాంపెయిన్ లో పాడేరు వీరమహిళలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాడేరులో జనసేన వీరమహిళా విభాగం కిట్లంగి పద్మ ఆధ్వర్యంలో డిజిటల్ కాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు విజయదుర్గ, దివ్యలత మరియు జనసైనికుడు సత్తిబాబు పాల్గొన్నారు.