సామాన్య కార్యకర్తలని నాయకులు చేయడమే జనసేన పార్టీ ద్యేయం: నలిశెట్టి శ్రీధర్

జనసేన పార్టీ లో సామాన్యులకి పదవులు ఇవ్వడం ద్వారా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ సరికొత్త రాజకీయాలకి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ అన్నారు. అనంత సాగరం మండలంలో క్రియాశీలకముగా పనిచేసే కార్యకర్తలైన బిల్లుపాటి కృష్ణమూర్తి యాదవ్, వేము ప్రవీణ్ అశోక్ లని ఉపాధ్యక్షులుగా, అధికార ప్రతినిధిగా కానగల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేణు గుడిపాటి, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా జాన్నిబోయిన వంశీ కృష్ణ యాదవ్, వేమన వెంకటేష్ ముదిరాజ్, పప్పు వాసు దేవర రెడ్డిలకి పదవులు ఇచ్చినందుకు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ కి ధన్యవాదాలు అని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్ తెలియచేశారు.