పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల నిరసిన దీక్షకు జనసేన మద్దతు

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని దేవిపట్నం సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసిన దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర. అంతేకాకుండా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జరుగుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.