ఇచ్ఛాపురంలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఇచ్ఛాపురం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సుమారు మూడు సంవత్సరాల కాలంలో తిప్పన దుర్యోధన రెడ్డి శ్రీ జనసైనికుల సాయంతో 3500 మందికి రక్తదానం చేయించి బుధవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇచ్ఛాపురం మండలం ధర్మపురం పంచాయతీలో ధర్మపురం గ్రామ జనసైనికుల సహాయంతో బ్లడ్ క్యాంప్ నిర్వహించి సుమారు 70 మందికి పైగా రక్తదానం చేశారు. ఇప్పటవరకు 4 బ్లడ్ క్యాంప్ లు నిర్వహించడం జరిగింది. రక్తదానం క్యాంపుకి ముఖ్య అతిథులుగా దాసరి రాజు(ఇచ్చాపురం నియోజకవర్గ ఇంచార్జి), బైపల్లి ఈశ్వరరావు (రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ), నాగుల హరి బెహరా మత్స్యకార విభాగం. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు జనసేన వీరమహిళలు జనసైనికులు అభిమానులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో రక్తం అందక ఎవరూ కూడా మరణించకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో జనసైనికుల సాయంతో ప్రతి ఒక్కరికి రక్తం అందించిన ప్రతి ఒక్క జనసైనికుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.