జనసేవా చారిటబుల్ ట్రస్ట్ కి జాతీయ యువజనోత్సవ వివేకానంద సేవా పురస్కారం

తెల్లపాడు, కలసపాడు మండలం కడపజిల్లా జానసేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కి వివేకానంద సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివేకనంద సేవా పురస్కారం అందజేయడం జరిగింది. జనసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంభాలకు నిత్యా అవసర సరుకులు, పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వంటి కార్యక్రమాలు గుర్తించి అవార్డు అందజేయటం జరిగిందని నిర్వాహకులు పాపిజెన్నీ రామకృష్ణా రెడ్డి ఈ అవార్డు పొరుమామిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు గ్రహీత మరియు జనసేన కొమరోలు మండల అధ్యక్షులు ఓబులేష్ నాయుడు మాట్లాడుతూ జనసేవా చారిటబుల్ ట్రస్ట్ కి ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉందని ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ,ఈశ్వరయ్య , తులసి సంస్థ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.