పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసిన జనసేన

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ విభాగం నాయకులు కాకర్ల బాబాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ లోనూ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా 3వ దశ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సెలవులు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.