రథసప్తమి శుభ సందర్భంగా శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, రథసప్తమి శుభ సందర్భంగా మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వికృతమాల శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు గ్రామ పుర ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగింది.