జనసేన జెండాను ఆవిష్కరించిన పాలవలస యశస్వి
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, సింగవరం గ్రామంలో మొట్ట మొదటిసారిగా గ్రామ జనసైనికులు అందరూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విశ్వాసంతో గ్రామంలో జనసేన జెండాను విజయనగరం నియోజకవర్గం ఇంచార్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ ఎత్తున వచ్చి, సింగవరం జనసైనికులకు అండగా నిలిచి కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-13-at-12.09.45-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-13-at-12.09.44-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-13-at-12.09.43-PM-768x1024.jpeg)