నిరుపేద విద్యార్ధినీవిద్యార్ధులకు ఆర్ధిక సాయమందించిన ఆర్.కె పౌండేషన్ మరియు కాపు వ్యాపార సమాఖ్య

మచిలీపట్నం, ఆర్థికస్తోమత లేని నిరుపేదలైన విద్యార్థినీ విద్యార్ధులకు విద్య నిమిత్తం ఆర్.కె పౌండేషన్ మరియు కాపు వ్యాపార సమాఖ్య(కె.వి.ఎస్) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంయుక్తంగా ఆర్.కె జూనియర్ కాలేజీలో చదువుతున్న పేద విద్యార్థినీ విద్యార్ధులయిన అక్కిశెట్టి మహిమ జ్యోతి, అక్కిశెట్టి మహిమరాజు తల్లి గృహలక్ష్మి కి 44,000 వేల రూపాయల చెక్కును అందజేసిన ఆర్.కె గ్రూప్ సంస్థల అధినేత బండి రామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఆర్.కె గ్రూప్ మరియు ఆర్.కె పౌండేషన్ అధినేత బండి రామకృష్ణ, కె.వి.ఎస్ (కాపు వ్యాపార సమాఖ్య) సభ్యులు మరియు ఆర్.కె కాలేజ్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.