జనసేన బలోపేతం కోసం విస్తృత ప్రచారం ఉపాధి కూలీలతో భేటీ: కరిమజ్జి మల్లీశ్వారావు

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, నగరపాలెం గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నగరపాలెం గ్రామంలో చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో జనసేన బలోపేతం కోసం ప్రజలతో మాట్లాడుతూ జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించడం జరిగింది. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంల అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి ఓటు వేయాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు, కోరడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.