రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన హిందూపురం జనసేన

హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ టీం పిడికిలికి సంభందించిన ఆటో మరియు గోడ పోస్టర్లను హిందూపురం జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన రైతు భరోసా యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితం 30 కోట్ల రూపాయలు పార్టీ తరుపున ఇవ్వడం దేశ రాజకీయాల్లో మొట్టమొదటి సారి చూస్తున్నాం. ఇలాంటి నాయకుడు మన దేశానికి ఆదర్శం అని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు నాగరాజు, నాయకులు మరియు జనసైనికులు బొంచేరువు భాస్కర్, లింగరాజు, మనోహర్, హనుమంతు, పవన్ కుమార్, చిరంజీవి, రామంజి, మహేష్, మారుతీ, నరేష్, ప్రశాంత్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.