ముఖ్యమంత్రిపై మండిపడ్డ కుంటిమద్ది జయరామ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, మత్స్యకార సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి దత్త పుత్రుడు అని సంబోధించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇంతకుముందే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకొక మారు నన్ను దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సి.బి.ఐ దత్తపుత్రుడు, చంచల్గూడ షటిల్ టీం అని సంబోధిస్తాము, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పిన కూడా, పదే పదే మూర్ఖంగా దత్త పుత్రుడు అని పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ మాత్రమే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజా సమస్యలపై పోరాడారు, కొన్ని సమస్యలను పరిష్కరించగలిగారు, సి.బి.ఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి మరియు చంచల్గూడ సెంట్రల్ టీం సభ్యులంతా 2017 నుండి 2019 వరకు అసెంబ్లీ కూడా వెళ్లకుండా, అధికార దాహం కోసం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రజలను నమ్మించి మోసం చేసి నేడు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాకా నేటివరకూ పాలన చేతకాక పూటకో అబద్ధం చెబుతూ ప్రజలకు భ్రమలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా సమస్యలపై స్పందిస్తూ మరీ ముఖ్యంగా కౌలు రైతులకు తన వంతు సహాయం అందిస్తూ ఉంటే, జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దాక దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో ఇది చూచి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ శునకానందం పొందుతున్నారు. సి.బి.ఐ దత్తపుత్రుడు, చంచల్గూడా షటిల్ టీం ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక మారు మీరు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని సంబోధిస్తే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. నీకు చేతనైతే అధికారంలో ఉన్నావ్ ప్రజలకు మంచి చేసి, ప్రజల మెప్పు పొందు అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు పేలితే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరామ్ రెడ్డి అన్నారు.