కందనాతి గ్రామంలొ పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం
ఎమ్మిగనూరు మండలం, కందనాతి గ్రామంలొ గురువారం జనసేన పార్టీ “పల్లె పల్లెకు జనసేన” కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి రేఖ జవ్వాజి కి ఆ గ్రామస్తులు మరియు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు .. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామంలో పర్యటించి అక్కడి ప్రస్తుత సమస్యలను తెలుసుకుని.. పార్టీ ఎపుడూ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవిప్రకాష్, జనసేన నాయకులు కరణం రవి, రాహుల్, బజారి, శబీర్, ఎల్లప్ప, కలగాట్ల రాజు, వినయ్, రమేష, రషీద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.