ఆగిరిపల్లి మండలం లోని అన్ని రోడ్లు వెంటనే వేయాలి – జనసేన డిమాండ్

*జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల అధ్వాన్న స్థితి పై ముడు రోజుల పాటు #Good morning CM Sir

*నిద్రపోతున్న ముఖ్యమంత్రికి పాడైన రోడ్ల పరిస్థితి తెలిపి నిద్ర లేపడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం..

నూజివీడు: ఆగిరిపల్లి మండలం లోని అన్ని రోడ్లు వెంటనే వేయాలనీ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివరామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆగిరిపల్లి రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో #Good morning CM Sir హ్యాష్ ట్యాగ్ తో ప్ల కార్డ్ లు పట్టుకొని డిజిటల్ క్యాంపెయిన్ బాగంగా ఆగిరిపల్లి పెట్రోల్ బంక్ వద్ద, చొప్పరపట్ల నుండి సగ్గురు రోడ్డు వద్ద నిరసన నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదనీ తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే #Good morning CM Sir కార్యక్రమం అని అన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని ప్రాంతాలో పాల్గొంటారనీ అన్నారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తారనీ, #Good morning CM Sir హ్యాష్ ట్యాగ్ తో రహదారుల దుస్థితి తెలియజేస్తున్నామని అన్నారు. నూజివీడు నుండి విజయవాడ రోడ్డుని, అలాగే ఆగిరిపల్లి మండలంలోని అన్ని గ్రామాల అంతర్గత రోడ్లు వెంటనే వేయాలని కోరారు.రోడ్లు వేయకపోతే జనసేన ప్రజల తరుపున పోరాడుతుంది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆగిరిపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ ముక్కు ఉమ సాయి మహేష్, పవన్, సాయి, రాకేష్, ప్రసాద్, రాంబాబు, సువర్ణ బాబు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.