గొడుగువారి గూడెం రోడ్డు వెంటనే వేయాలి: శివరామకృష్ణ డిమాండ్

నూజివీడు టౌన్: గొడుగువారి గూడెం రోడ్డు వెంటనే వేయాలనీ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శివరామకృష్ణ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల అద్వాన్న స్థితిపై జరుగుతున్న #GoodMorningCMSir. డిజిటల్ క్యాంపెయన్ పోగ్రామ్ లో భాగంగా జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివ రామ కృష్ణ మాట్లాడుతూ.. నూజీవీడు టౌన్ లో గొడుగువారిగూడెం దగర ఉన్న కురివిడి చెరువు పక్కన రోడ్ గత ఆరు నెల్లల క్రితం వచ్చిన వానలలకి కొట్టుకుపోవటం జరిగిందన్నారు. ఈ రోడ్లు పరిస్థితులు ఎప్పుడు బాగుపడుతుంది అని ప్రజలు వాపోతున్నారనీ తెలిపారు. ఈ రోడ్డు త్వరగా వెయ్యాలి అని నూజీవీడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతాప్ అప్పరావు గారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసారు. చెయ్యాలని ఎడల ఈ రోడ్డు మరమ్మతులు జరగక పోతే రోడ్డుని దిగ్బంధం చేసి మరింతగా పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివ రామకృష్ణ, నూజీవీడు జనసేన నాయకులు సూరిశెట్టి శివ, ముమ్మలనేని సునీల్ కుమార్, ఏనుగుల చక్రి, ధర్మక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, పాత రావిచర్ల జనసేన నాయకులు తోట బలరాం, అశోక్, సిద్ధిక్ మరియు తదితరులు పాల్గొన్నారు.