మౌళిక సదుపాయాలను కల్పించాలని జనసేన డిమాండ్

పుట్టపర్తి, కొత్తచెరువులోని రెండు మరియు మూడు వార్డులలో సచివాలయాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన దుద్దికుంట శ్రీధర్ రెడ్డికి జనసేన పార్టీ మండల కన్వీనర్ పూల శివప్రసాద్ పుట్టపర్తి నియోజవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తచెరువులో గడిచిన మూడు సంవత్సరాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అవడం జరిగింది. ఇవి జరిగే సంవత్సరాలు కలుస్తున్న వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు. కొత్తచెరువు కూడలి రోడ్లలో డివైడర్ల పైన ఉన్న వీధిలైట్లు కూడా పడక నెలల కాలం అవుతోంది కానీ ఇంతవరకు వాటిని మరమ్మతులు చేయలేదు. శుక్రవారం బిసి కాలనీలో ప్రజలతో మమేకమవ్వగా అక్కడ రోడ్లకి సరియైన సైడ్ కాలువలు లేక రోడ్లు మొత్తం మురికి గుంటలుగా తయారైపోయాయి. పంచాయతీ వారు కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని ప్రజలు వాపోయారు. దర్గా వీధిలో ఉన్న మసీదు దగ్గర ఉన్న రోడ్ పరిస్థితి కూడా సైడ్ కాలవలు లేక అధ్వానమైన దుస్థితిలో ఉంది. వీటి అన్నిటి పైన తక్షణమే తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలకి మౌళిక సదుపాయాలని అన్నిటినీ కల్పించాలని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేశారు.