వి.ఆర్.ఏ ల నిరవదిక సమ్మెకు జనసేన మద్దతు

  • గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వి.ఆర్.ఏ లు చేస్తున్న నిరవదిక సమ్మెకు రామగుండం నియోజకవర్గంలో మద్దతు తెలిపిన జనసేన రామగుండం నాయకులు

రామగుండం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి మూల హరీష్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ యువజన అధ్యక్షులు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ రావుల సాయి కృష్ణ సూచనల మేరకు వి.ఆర్.ఏ లు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్ధతు తెలిపిన జనసేన రామగుండం మండల నాయకులు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ కార్యదర్శి గోపి కృష్ణ మరియు రామగుండం మండల యువజన అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వి.ఆర్.ఏ లకీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జనసేన తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వి.ఆర్.ఏ లకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని జనసేన నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల యువజన ఉపాధ్యక్షులు తిరుపతి, రాజశేఖర్, రవికాంత్ మండలం యువజన ఆర్గనైసింగ్ కార్యదర్శి శశాంక్, మండల యువజన కార్యదర్శి లోకేష్ మరియు ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ తిప్పరపు సురేష్, ఆశ్విత్ పాల్గొన్నారు.