నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం..!

సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా అని నిర్ధారణ కావడంతో హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు రాజశేఖర్ కుటుంబం. ఆయన కుమార్తెలు కరోనా ప్రభావం నుండి  కోలుకున్నారు. అయితే వీరిలో కరోనా ప్రభావం రాజశేఖర్ కు ఎక్కువ ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన కుమార్తె శివాని తన తండ్రికోసం ప్రార్ధన చేయండి అంటూ అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరింది. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటంతో శ్వాసతీసుకోవడంలో సమస్య ఏర్పడిందని వైద్యులు తెలిపారు. కాగా తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు వైద్యులు.

సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు రాజశేఖర్‌ ఆరోగ్యంపై బులిటెన్‌ విడుదల చేశారు. ”కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరిన డాక్టర్‌ రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్‌ కూడా మా టీమ్‌ అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలియ జేశారు. ఇక కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్‌ సతీమణి జీవిత సైతం కోలుకున్నారు. ఈ రోజు ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జీ చేశాం” అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.