ఎంపీ గోరంట్ల పై చర్యలు తీసుకోవాలంటూ.. జనసేన నిరసన

సత్యసాయి జిల్లా, హిందూపురం పార్లమెంట్ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ఆదివారం పెనుగొండ మండలంలో జనసేన పార్టీ పెనుకొండ మండల అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ సర్కిల్లో బైటాయించి.. ఎంపీ గోరంట్ల మాధవ్ ని వెంటనే ఎంపీ పదవీ నుంచి రాజీనామా చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి, రాష్ట్ర చేనేత కార్యదర్శి ఎర్రిస్వామి చిప్పల, నియోజకవర్గ నాయకులు కుమార్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ మండల కన్వీనర్లు, మహేష్, జేబీ, గంగాధర, వీర మహిళ, శిరీష జనసేన నాయకులు, రాజేష్, నాగరాజ్, ప్రదీప్, హరి నాయక్, సురేష్, సయ్యద్ బాబా, విజయ్ సంతోష్, హర్ష, శీన, ప్రసాద్, హనుమంతు, ఆటో నారాయణ, మూర్తి, చలపతి, సోము, చంద్ర, కొల్లప్ప, రవి, రెడ్డి, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.