లాసెట్‌ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్ విద్యార్దిని కీర్తిని సన్మానించిన రాయపూడి

అవనిగడ్డలో లాసెట్ లో రాష్ట్ర మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థిని చల్లపల్లి కి చెందిన కీర్తిని జనసేన పార్టీ, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు శనివారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అవనిగడ్డ నియోజకవర్గం కు మంచి పేరు రావటం చాలా గొప్ప విషయం. రాష్ట్ర మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థిని కీర్తికి ఆమె తల్లి తండ్రులకు, జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ గారి తరుపున ధన్యవాదములు తెలుపడం జరిగింది. 5ఏళ్ళ లా కోర్సు పూర్తి చేసుకొని జడ్జి అయ్యి అందరికి న్యాయం చెయ్యాలి అనీ దీవించటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *