15న జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో స్వాతంత్ర్య అమృతోత్సవాలు
•14న ఐటీ సమన్వయకర్తలు, వలంటీర్లతో సమావేశం
• పాల్గొననున్న శ్రీ పవన్ కళ్యాణ్
దేశ స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 15వ తేదీ ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 14వ తేదీన జనసేన పార్టీ ఐటీ సమన్వయకర్తలు, ఐటీ వలంటీర్ల సమావేశం ఏర్పాటైంది. పార్టీ కార్యక్రమాలకు ఐటీ నిపుణులు సహాయసహకారాలపై చర్చిస్తారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పార్టీ నేతలు, శ్రేణులు సమర్థంగా వినియోగించుకోవడం గురించి ఐటీ నిపుణులు వివరిస్తారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీనివాస్ మిరియాల పాల్గొంటారు. పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు.