స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మధుసూదన్
75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లక్కనపల్లి పంచాయితీ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి మధుసూదన్ పంచాయతీలోని పాఠశాలకు విచ్చేసి.. పిల్లలతో కలసి.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని.. పిల్లలకు స్వీట్స్ మరియు బహుమతులు పంపిణి చేసి ఆనందంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రవి, కిషోర్, గంగాధర్, ఎస్ బాలకృష్ణ, నరేంద్ర, పద్మనాభం మంజునాథ్, బాలకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.