ఘనంగా పాలకొండ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

పాలకొండ నియోజకవర్గం. జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అధ్వర్యంలో రాజాం రోడ్ ఎస్.ఎల్.ఆర్ రైస్ మిల్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకొని జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. అనంతరం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆరుకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి వంపూరు గంగులయ్య, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ గేదెల చైతన్య, ఆమదావలస నియోజకవర్గ ఇన్చార్జ్ పెడాడ రామ్మోహన్, ఇచ్చాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాసరి రాజు, శ్రీకాకుళం ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, కార్యనిర్వాహణ కమిటి కోఆర్డినేటర్ విశ్వక్సేన్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు దుర్యోధన్ రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, టెక్కలి నియోజకవర్గ నాయకులు కురాకుల యాదవ్, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతిరావు, నిద్దాం సర్పంచ్ మీసాల రవి, ఎంపిటిసి అంపిలి విక్రమ్, పార్వతీపురం జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ, కురుపాం ఎంపిటిసి అభ్యర్థి మల్లేష్, సోంపేట వీర మహిళ శైలజ తదితరులు పాల్గొన్నారు.