వనపర్తి జిల్లా జనసేన కార్యాలయంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు

వనపర్తి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి తదనంతరం కేక్ కట్ జరుపుకుని సమావేశం నిర్వహించారు. సమావేశంలో వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజా అభివృద్ధి శ్రేయస్సు కొరకు పనిచేస్తుందని, అధికారం పదవులకంటే అవినీతి రహిత సమాజం నిర్మించడమే జనసేన ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. సామాన్యులకు కూడా రాజకీయాలను చేరువ చేయడం, అన్ని వర్గాలకు అధికారం అందించడం పార్టీ సిద్దాంతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉత్తేజ్, ఆర్కే, శ్రీనివాసులు, హేమవర్ధన్, మద్దిలేటి, నితిన్, మహేష్, బన్నీ రమేష్ తదతరులు పాల్గోన్నారు.