జనసేన ఆధ్వర్యంలో ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేత

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎంటిఎంసి పరిధిలోని 36,37,38 డివిజన్లలో పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు జనసేన పార్టీ మరియు కాపరౌతు ఫౌండేషన్లు సంయుక్తంగా ప్రమాద భీమా చేయించి పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎంటిఎంసి కన్వీనర్ మునగపాటి మారుతిరావు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకు వచ్చి వారి సమస్యను మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి వివరించవచ్చని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంటిఎంసి కన్వీనర్ మునగపాటి మారుతిరావు, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు, మంగళగిరి మండల కమిటీ సభ్యులు బత్తినేని అంజయ్య, మంగళగిరి మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, కాపరౌతు ఫౌండేషన్ డైరెక్టర్ కాపరౌతు సుందరయ్య, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.