నా సేనకోసం… నావంతు కు ఆరణి గిరీష్ విరాళం
శభాష్…! ఆరణి గిరీష్….!! “నా సేనకోసం… నావంతు” అంటూ స్వచ్ఛందంగా చిత్తూరుకు చెందిన ఆరణి ఉపేంద్ర, ఆరణి అంజలి గార్ల కుమారుడు చిరంజీవి ఆరణి గిరీష్ ₹.25,000/-లు ( అక్షరాలా ఇరవై ఐదు వేల రూపాయలు) జనసేన పార్టీకి తనవంతు బాధ్యతగా శుక్రవారం జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా భూరి విరాళం పంపించి పవన్ కళ్యాణ్ గారిపై, జనసేన పార్టీపై తనకు, తన కుటుంబ సభ్యులందరికీ గల అపార ప్రేమాభిమానాలు మాటల్లో కాకుండా చేతల్లో ఇలా చూపించారు. అలాగే ఆరణి ఉపేంద్ర, ఆరణి అంజలి కూడా తమతమ వంతు బాధ్యతగా ఇటీవలి కాలంలో తరచుగా స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తూ.. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తున్నారు. చిత్తూరు జనసేన యువ నాయకుడు ఆరణి గిరీష్ కు, అతని తల్లిదండ్రులు ఆరణి ఉపేంద్ర, అంజలి లకు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ తరపున
నానబాల లోకేష్ రాయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.