‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని చాలెంజ్ గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దారం అనిత

మదనపల్లె, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఒక ఛాలెంజ్ గా తీసుకొని తాము పార్టీకి తమకు తోచినంత సహాయాన్ని అందించి ఈ యొక్క విషయాన్ని తమ బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి స్నేహితులకు తెలియజేసి మరింత మందిని పార్టీకి అనుసంధానం చేయాల్సిందిగా అదేవిధంగా ప్రతి మండలంలోనూ పంచాయతీల వారీగా మండల కమిటీ సభ్యులకు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే అంశాల మీద చర్చించడం జరిగినది. అదేవిధంగా క్రియా మెంబర్షిప్ చేసుకున్న అందరు దయచేసి అస్త్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని, తద్వారా పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే అంశాల మీద చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు హరి, ముని ప్రసాద్ పాల్గొన్నారు.