‘నా సేన కోసం నా వంతు’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు

  • రాజానగరంలో జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న ‘నాసేన కోసం నా వంతు’ కార్యక్రమం ‘నాసేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ముఖ్యఅతిథిగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి వైసిపి, టిడిపికి చెందిన సుమారు 100 మంది జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు పంపి జనసేన పార్టీ ఆర్థిక పరిపుష్టికి సహకరించాలని పిలుపునివ్వడం జరిగింది. జనసేన శ్రేణులు అందరూ మీకు తోచిన విధంగా జనసేన పార్టీ ఖాతాకు అనుసంధానమైన నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సర్పంచులు కిమిడి శ్రీరామ్, గళ్ళ రంగా, గుల్లింకల లోవరాజు, సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీను, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, కామిశెట్టి హిమశ్రీ, రామిశెట్టి విష్ణు, గంగిశెట్టి రాజేంద్ర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.