“నా సేన కోసం నా వంతు” పోస్టర్ ఆవిష్కరించిన చినగంజాం జనసేన

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు, చినగంజాం మండల జనసేన పార్టీ మండల సమావేశం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజయకుమార్ మాట్లాడుతూ నూతనంగా నీయతమైన మండల కమిటీకి దిశా నిర్దేశం చేశారు తదనంతరం నా సేన కోసం నా వంతు అని పోస్టరును రిలీజ్ చేశారు. స్థానికంగా ఉన్న నాయకులందరూ నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.