పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీలో నూతన నాయకత్వం…!

పార్వతీపురం మాన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం మనుమకొండ గ్రామానికి చెందిన “నిమ్మల నిబ్రహం” జనసేన పార్టీలో మంగళవారం ఆగస్టు 1వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్న సందర్భంగా, ముందురోజు జనసేన కార్యాలయంలో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, పిసిని చంద్రమోహన్, ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, పాలకొండ నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. నిబ్రహం రాకతో పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం జరుగుతుందని స్థానిక నాయుకులు జనసైనికులు వీరమహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని పాలకొండ నియోజకవర్గం జనసేన టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.