ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 23వ రోజు
ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ నిర్వహిస్తున్న “పవనన్న ప్రజాబాట” స్థానిక జగన్నాథ రావు పేట ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా నడుస్తున్న ముందుకు సాగింది. “పవనన్న ప్రజాబాట” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని జనసేన ద్వారా పరిష్కరించేలా కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. జనసేన సిద్ధాంతాలను ముద్రించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-14.34.03-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-14.34.07-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-14.34.05-1024x577.jpeg)