జనసేన ఆధ్వర్యంలో దసపల్ల భూముల పరిరక్షణ కొరకై మహాధర్నా
విశాఖపట్నం నగరంలో గల విలువైన దసపల్ల భూములు అన్యాక్రాంతం అయ్యేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ – విశాఖపట్నం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పెద్దలు ఈ భూములను చేజిక్కించుకొనుట కొరకు చేస్తున్న చర్యలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కోన తాతారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్, నియోజకవర్గ ఇన్చార్జులు పివిఎస్ఎన్ రాజు, శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, సందీప్ పంచకర్ల, పీల రామకృష్ణ, ముగి శ్రీనివాసరావు, జీవీఎంసీ కార్పొరేటర్లు దల్లి గోవింద రెడ్డి, పీతల మూర్తి యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర క్రౌడ్ ఫండింగ్ మెంబర్ తిప్పల రమణారెడ్డి, గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ వార్డ్ ఇన్చార్జిలు కర్ణం కనకారావు, గవర సోమశేఖర్ రావు, కాద శ్రీను, కోన చిన అప్పారావు, ఆర్మీ గోవింద్, మమ్మును మురళి, సండ్రాన భాస్కర్, వీరమహిళలు శ్రీమతి కర్ణం కళావతి, శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి మురళి దేవి, శ్రీమతి జ్యోతి రెడ్డి, శ్రీమతి షాలిని, శ్రీమతి సన్నీ లక్ష్మీ, జనసేన నాయకులు గుంటూరు మూర్తి, మజ్జి వినోద్, విందులు వెంకటరమణ, గలకోటి సోమన్న, రామారావు, బంగారు రాజు, మల్లెపూలు మురళి, ముసలయ్య, సత్యనారాయణ, పి వసంత, మేడిశెట్టి విజయ్, కిలాడి నాయుడు, రవీంద్ర, వీరబాబు జనసైనికులు, వీరమహిళలు మరియు వివిధ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-10-at-20.13.24-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-10-at-20.13.25-1024x458.jpeg)