పాలకొండ జనసేన ఆధ్వర్యంలో ఉచితవైద్య శిబిరం

పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో మరియు కూరంగి నాగేశ్వరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ మెనేజర్), జెమ్స్ హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో స్థానిక పెద్దమంగళాపురం గ్రామం జనసేన నాయకులు జల్లు సోంబాబు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా 150 కి పైగా ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వారికి సుగర్, బిపి, ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు, అన్ని రకాల వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న అందుబాటులో ఉంటామని స్వయంగా వైద్యం చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.