మైథాన్ కంపెనీ కార్మికులకు న్యాయం చెయ్యండి: బాబు పాలురు

బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో గల మైథాన్ కంపెనీ దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం ఉదయం డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ ను విజయనగరంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలురు జెఎస్పి కలిసి కంపెనీ చేస్తున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. కార్మికులు అన్యాయానికి గురౌతున్నారని, కంపెనీ యాజమాన్యం కార్మికులను రోడ్డున పడేసిందని, వారికి న్యాయం జరిగేలా చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. మురళి, జయేష్, కల్యాణ్ తదితర జనసేన నాయుకులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-05-04-at-6.34.25-PM-1024x768.jpeg