పుష్పశ్రీవాణి అసత్య మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం..!

  • అసలు సిసలైన చీకటి సామ్రాజ్యం మీదే కదా..!
  • వైసీపీ, టిడిపిలో ఉన్నది మీ కుటుంబమేగా..!
  • మాట తీరుల కోసం మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
  • పిట్ట కధలు బాగానే చెప్తున్నారు.
  • 2019 లో పవన్ కళ్యాణ్ వల్లే మీకు అన్ని స్థానాలు వచ్చాయి.
  • మీ అన్న కేవలం 10శాతం తేడా తోనే ముఖ్యమంత్రి అయ్యాడు.
  • వైసీపీ మూడేళ్ళలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.
  • మూడేళ్ళలో ఒక్క రాజధానికి ఒక్క ఇటుక వెయ్యలేదు కానీ మూడు రాజధానులు కడతారా..?
  • మంత్రుల దాడి ఒక డ్రామా..?
  • జనసేన నాయకులు ఎంపీటీసీ మల్లేష్, సర్పంచ్ క్రాంతి.

గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట తీరుల కోసం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కొడకల్లారా అంటేనే అంతలా బాధేస్తే వైసీపీ నాయకులు నోటికొచ్చిన భూతు పంచాంగంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను వాళ్ళ ఇంటిలో మహిళల కోసం మాట్లాడినప్పుడు ఏమయ్యింది? మాట తీరని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు సభలో బూతు మాట్లాడినప్పుడు ఏమయ్యింది? మాట తీరని మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు భూతు పంచాంగాలు చదువుతుంటే రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశం ఇచ్చినట్టుని కురుపాం నియోజకవర్గ జనసేన నాయకులు ఇరిడి ఎంపీటీసీ కడ్రక మల్లేశ్వరరావు, డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతి ధ్వజమెత్తారు. గురువారం గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగిలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు సిసలైన చీకటి సామ్రాజ్యం మీదే కదా? వైసీపీ, టిడిపిలో ఉన్నది మీ కుటుంబమేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్ లో నడిస్తే మీరు మీ పెదమామ విజయరామరాజు డైరెక్షన్ లో నడుస్తున్నారా? కథలు బాగానే చెప్తున్నారని 2019 లో కేవలం పవన్ కళ్యాణ్ వల్లే మీకు అన్నీ స్థానాలు వచ్చాయని జనసేన ఓట్ల చీలికతోనే గెలిచారని మీ జగనన్న కేవలం 10 శాతం తేడాతోనే ముఖ్యమంత్రి అయ్యాడని మంత్రులపై దాడి ఒక డ్రామానని మందు అధికార పార్టీ గర్జన చెయ్యడమే విడ్డురంమని మళ్ళీ అది చెడగొట్టడానికి పవన్ కళ్యాణ్ వచ్చాడని అనడం సిగ్గుచేటని ఆయన కార్యక్రమం ఎప్పుడు ఖరారు అయ్యింది మీ గర్జన ఎప్పుడు ఖరారు అయ్యిందని మీ విశాఖ గర్జన మధ్యాహ్నం అయితే సాయంత్రం పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో మంత్రులు అక్కడకి చేరుకొని హావభావాలతో వెక్కిరి చేష్టలతో జనసైనికులను రెచ్చగొట్టిన సంయమనం పాటించారని వైసీపీ ప్రభుత్వం మూడేళ్ళలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని సంఘీభావం తెలపడానికి చంద్రబాబు వస్తే మీకెందుకు ఉలిక్కిపాటని విశాఖ భూ కబ్జాలు ఎక్కడ బయట పడతాయోనని పోలీసులతో ఆయనని అడ్డుకున్నారని ఈ మూడేళ్ళలో ఉన్న ఒక్క రాజధానికి ఒక్క ఇటుక వెయ్యలేదు కానీ మూడు రాజధానులు కడతారా? విశాఖ రాజధాని కంటే పెద్ద నగరం దానికి మళ్ళీ రాజధానని పబ్బం గడుపుకుంటున్నారని పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా పని చేశారు ఎంతో ప్రతిష్ట కలిగిన శత్రుచర్ల కుటుంబానికి కోడలై ఈ విధమైన అసత్యాలు మాట్లాడుకూడదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.